పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు రాత్రి బాగానే తిని పడుకున్నాడు గుండె పోటు గతంలో వచ్చిందే లేదు.అయినా కూడా రాత్రికి రాత్రే చనిపోయాడు అంటూ మన బంధువులు లేదంటే మరెవ్వరైనా అకస్మిక మరణం పొందిన సమయంలో వారి కుటుంబ సభ్యులు చెప్పే మాటలు ఇవి.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా కూడా రాత్రి సమయంలో ఆకస్మిక మరణం పొందిన వారు కొన్ని వేల మంది ఉండి ఉంటారు.మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి మరణాలు గతంలో చాలా సంభవించాయి.
అలాంటి మరణాలపై రీసెర్చ్ చేసిన ఒక వైధ్య బృందం చివరకు ఒక రిపోర్ట్ను తయారు చేయడం జరిగింది.
ఆ రిపోర్ట్ ప్రకారం అలాంటి మరణాలకు ప్రధాన కారణం నిద్రలోంచి దిగ్గున లేవడం, వెంటనే బాత్రూం లేదంటే మరేదైన పనికి వెళ్లడం వంటివి చేయడం.నిద్రలో ఉన్న సమయంలో మెడదు కూడా నిద్రావస్థలో ఉంటుంది.ఆ కారణంగా దిగ్గున లేచి వెంటనే ఏదైనా పని చేయడం లేదంటే ఆలోచించేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తే గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంది.
మెదడు నిద్ర పోయిన సమయంలో రక్తహీనతతో ఉంటుంది.అప్పుడు లేవడంతో పాటు వెంటనే ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తే గుండె ఆగిపోతుంది.అందుకే నిద్ర లేచిన తర్వాత కనీసం మూడున్నర నిమిషాల పాటు ఇప్పుడు చెప్పినట్లుగా చేయాలి.
మెలుకువ వచ్చిన వెంటనే లేవకుండా కనీసం నిమిషం పాటు మంచంపై అలాగే ఉండిపోవాలి.
నిమిషం తర్వాత మంచం పై నుండి లేచి కొద్ది సమయం కూర్చుని ఉండాలి.కనీసం అర నిమిషం అయినా కూర్చుని ఉండాలి.
ఆ తర్వాత మెల్లగా కాళ్లను కిందకు దించి నిల్చోవాలి.అలా నిల్చున్న సమయంలో రక్త ప్రసరణ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది.
ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పాటించాలి.ముఖ్యంగా అయిదు పదుల వయసు దాటిన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.మూడున్నర నిమిషాల బదులు వారు కనీసం అయిదు నిమిషాల పాటు బెడ్ నుండి కిందకు దిగేందుకు సమయం తీసుకోవాలంటూ వైధ్యులు సూచిస్తున్నారు.
ఎంతో కీలకమైన ఈ సమాచారంను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి.
.