బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ఆయన సినిమా టీం సందడి చేయనున్నారు.అన్ స్టాపబుల్ సీజన్ 2లో సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి టీం తో స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట.
న్యూ ఇయర్ కానుకగా ప్రభాస్ ఎపిసోడ్ ని పార్ట్ 1 గా రిలీజ్ చేయగా జనవరి 6న ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 2 స్ట్రీమింగ్ కానుంది.ఇక ఈ ఎపిసోడ్ తర్వాత సంక్రాంతికి వీర సింహా రెడ్డి టీం తో స్పెషల్ చిట్ చాట్ ఉంటుందని తెలుస్తుంది.
బాలయ్య హోస్ట్ గా తన సినిమానే తాను ప్రమోట్ చేసుకుంటాడని అంటున్నారు.ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్, హీరోయిన్ తో పాటుగా నిర్మాతలు కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 వరుస క్రేజీ ఎపిసోడ్ లతో సత్తా చాటుతుంది.బాలయ్య అటు సినిమాలతో ఇటు షోలతో అదరగొట్టేస్తున్నాడని చెప్పొచ్చు.పొంగల్ బరిలో దిగుతున్న వీర సింహా రెడ్డి సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.
శృతి హాసన్ తో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారు.