మంటల్లో కాలిపోతూ 100కి డయిల్ చేసింది! ప్రత్యక్ష సాక్షుల కథనం

దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.వీటిని ఎంత అదుపు చేసే ప్రయత్నం చేసే మానవ మృగాలు ఒంటరి మహిళపై దారుణాలకి పాల్పడుతున్నారు.

 Unnao Walked Kilometer-TeluguStop.com

తాజాగా దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి దోషులకి ఉరిశిక్ష వేయాలనే డిమాండ్ వినిపిస్తుంది.అయిన కూడా అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ప్రతి ఒక్కరికి కలచివేసింది.ఈ ఘటన మీద ప్రత్యక్ష సాక్షులు సంచలన విషయాలు తెలియజేసారు.

అత్యాచార బాధితురాలిపై బెయిల్ మీద బయటకి వచ్చిన నిందితులు దాడిచేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

సజీవ దహనం చేసే ప్రయత్నం చేసిన నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది.

సహాయం కోసం అర్ధిస్తోంది.ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఓ వ్యక్తి ఆమెను పలకరింఛి మంటలని ఆపే ప్రయత్నం చేసారు.

అతని దగ్గర ఉన్న ఫోన్ ని బాధితురాలు తీసుకొని మంటల్లో కాలి ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న కూడా పోలీసుల అత్యవర నంబరుకు కాల్‌ చేసింది.ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన ప్రత్యక్ష సాక్షులు తెలియజేయగా ఇప్పుడు ఈ ఘటనపై స్థానికంగా చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube