దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.వీటిని ఎంత అదుపు చేసే ప్రయత్నం చేసే మానవ మృగాలు ఒంటరి మహిళపై దారుణాలకి పాల్పడుతున్నారు.
తాజాగా దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి దోషులకి ఉరిశిక్ష వేయాలనే డిమాండ్ వినిపిస్తుంది.అయిన కూడా అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ప్రతి ఒక్కరికి కలచివేసింది.ఈ ఘటన మీద ప్రత్యక్ష సాక్షులు సంచలన విషయాలు తెలియజేసారు.
అత్యాచార బాధితురాలిపై బెయిల్ మీద బయటకి వచ్చిన నిందితులు దాడిచేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.
సజీవ దహనం చేసే ప్రయత్నం చేసిన నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది.
సహాయం కోసం అర్ధిస్తోంది.ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఓ వ్యక్తి ఆమెను పలకరింఛి మంటలని ఆపే ప్రయత్నం చేసారు.
అతని దగ్గర ఉన్న ఫోన్ ని బాధితురాలు తీసుకొని మంటల్లో కాలి ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న కూడా పోలీసుల అత్యవర నంబరుకు కాల్ చేసింది.ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన ప్రత్యక్ష సాక్షులు తెలియజేయగా ఇప్పుడు ఈ ఘటనపై స్థానికంగా చర్చించుకుంటున్నారు.