మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు ఎంట్రీ ఇవ్వగా ఆ హీరోలలో ఎక్కువ మంది హీరోలు సక్సెస్ అయ్యారు.మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం విడుదలైన ఉప్పెన సినిమా టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది.నిన్న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఉప్పెన ట్రైలర్ విడుదలైంది.అయితే ఉప్పెన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.అయితే ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటించగా విజయ్ సేతుపతికి వాయిస్ మ్యాచ్ కాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ వాయిస్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.విజయ్ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ గాంభీర్యంగా ఉంటే డైలాగ్స్ చెప్పిన విధానం మాత్రం పవర్ ఫుల్ గా లేదని.
వీలైతే వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించాలని ఫ్యాన్స్ చూపిస్తున్నారు.విజయ్ గొంతుకు డబ్బింగ్ చెప్పింది ఎవరనే విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.
విజయ్ సేతుపతికి టాలీవుడ్ లో అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
విజయ్ సేతుపతి కోసమే ఈ సినిమా చూడాలనుకునే వారికి సినిమాలో కూడా ఇదే వాయిస్ ఉంటే ఇబ్బందే అని చెప్పవచ్చు.
కరోనా విజృంభణ వల్ల ఆలస్యంగా విడుదలవుతున్నా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో సక్సెస్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.