ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వ్యాక్సిన్ లు చాలా దేశంలో అందుబాటులోకి రావడంతో వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం జనాలు ఎగబడుతున్నారు.ఈ క్రమంలో అగ్రదేశాలుగా పిలవబడే దేశాలు కూడా.
వ్యాక్సిన్ తమకే కావాలని తెగ ఆరాటపడుతున్నాయి.ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉంటే ఇండియాలో మాత్రం భారతీయులు వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం అసలు ముందుకు రావడం లేదని లెక్కలు చెబుతున్నాయి.
వ్యాక్సిన్ చేయించుకోవడం ఇక అవకాశాలు వస్తున్నా గాని తప్పించుకోవడానికి అనేక సాకులు చెబుతున్నారట భారతీయులు.ఈ విషయం ఎప్పుడో అంతర్జాతీయ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఈనెల 16వ తారీఖున ప్రధాని మోడీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టగా తొలివిడతలో వైద్యులు వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ అందించారు.అయితే తొలివిడతలో మొత్తం లక్ష్యంలో 56 శాతం మాత్రమే చేరుకోగలిగారు అట.వ్యాక్సిన్ వేయించుకోపోటానికి గల కారణం చూస్తే ఎలర్జీ అదేవిధంగా కొన్ని చోట్ల మరణాలు సంభవించడంతో భారతీయులలో కరోనా వ్యాక్సిన్ అంటేనే భయం ఏర్పడినట్లు టాక్ వినబడుతోంది.