ఈ మధ్య కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా చేసేటువంటి వ్యాఖ్యలు సెలబ్రిటీల జీవితాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరి మృతి చెందిన ఈ సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు టాలీవుడ్ ప్రముఖ ఫిమేల్ సింగర్ మాళవిక ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మృతికి కారణమంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.
దీంతో తాజాగా సింగర్ మాళవిక ఈ విషయం గురించి స్పందించింది.
ఇందులో భాగంగా తాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి “సరిగమప” సంగీత కార్యక్రమానికి పాల్గొన్న మాట వాస్తవమే కానీ అంతకు ముందు తనకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని అందువల్లే ఆ కార్యక్రమానికి హాజరు అయ్యానని చెప్పుకొచ్చింది.
కానీ ఆ షో నుంచి వచ్చేసిన తర్వాత తాను కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని అప్పుడు తనకు పాజిటివ్ వచ్చిందని అంతే తప్ప తాను సరిగమప షోలో పాల్గొన్న సమయంలో తనలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది.అయితే ప్రస్తుతం తాను కరోనా పాజిటివ్ వచ్చినందువల్ల తన కుటుంబ సభ్యులతో కలిసి హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్నానని దాంతో కొందరు తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ఈ మధ్యకాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీల గురించి అసత్య ప్రచారాలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.