ఎవరో తెలియదు.ఎందుకో తెలియదు.
మేస్త్రి పనికి వెళ్లే ఓ వ్యక్తి గొంతు కోసి అడవి ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయారు.ఈ దారుణమైన ఘటన తెలంగాణలోని తలకొండపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఫరూక్ నగర్ మండలం వెంకన్నగూడ పంచాయతీకి చెందిన కొడవత్ రాజు రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్ళాడు.
ఇంకా హైదరాబాద్లోని బండ్లగూడలో ఓ ఫంక్షన్ హాల్ లో పని చేసుకుంటూ భార్య పిల్లలతో జీవనం సాగించాడు.అయితే కరోనా ప్రభావం కారణంగా ఆ ఫంక్షన్ హాల్ తెరుచుకోకపోవడంతో రాజు గత మూడు నెలలుగా మేస్త్రి పనికి వెళుతున్నాడు.
అయితే ఇలా వెళ్తూ భార్య పిల్లలను చూసుకుంటున్న కొడవత్ రాజు నిన్న శుక్రవారం ఉదయం పనికి అని వెళ్ళాడు.
అయితే ఏమైందో తెలియదు 9 గంటలకు నల్లమెట్టు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై గాయంతో పడి ఉన్నాడు.
గొంతుపై గాయంతో అవస్ద పడుతున్న రాజునూ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడు రాజుతో మాట్లాడే ప్రయత్నం చేశారు.
అయితే మాట్లాడలేని స్థితిలో ఉన్న బాధితుడు రాజు చేతి సైగలా ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేశాడు.రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఈఎన్ టీ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.