తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా మనుగడ సాగించలేరు.దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు.
కానీ ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న భామలంతా దిగుమతి చేసుకున్న సరుకే.తెలుగు గడ్డపై పుట్టి పెరిగిన ముద్దుగుమ్మలు తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినా.
ప్రస్తుత కాలంలో సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.స్వాతి, అంజలి లాంటి హీరోయిన్లు వచ్చినా.
చాలా కాలం ఇక్కడ కొనసాగలేదు.అంజలి మాత్రం ఉన్నంతలో బెస్ట్ అనిపించుకుంది.
తెలుగులో పలువురు స్టార్ హీరోలతో పాటు తమిళ పరిశ్రమలోనూ మంచి సినిమాలు చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఈషా రెబ్బా, ఆనంది కూడా కాస్త ఫర్వాలేదు అనిపించినా.
మరీ పరిధి దాటి నటించేందుకు ఓకే చెప్పక పోవడంతో త్వరగానే ఫేడౌట్ అయ్యే స్థితికి చేరారు.ఈ సందర్భంలోనే మరో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ముందుకు వస్తోంది.
ఇంతకీ తను ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.
శోభిత. ఆంధ్రాలోని గుంటూరు జిల్లా తెనాలిలో ఈమె జన్మించింది.నటిగా మాత్రం బాలీవుడ్ నుంచి ప్రయాణం మొదలు పెట్టింది.తన తొలి సినిమా రామన్ రాఘవ్ 2.0 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.ఆ తర్వాత తెలుగుతో పాటు మలయాళం సినిమాల్లో నటించింది.
అడవి శేషుతో కలిసి గూఢాచారి సినిమా చేసి ఓ రేంజిలో హిట్ అందుకుంది.ఆ తర్వాత తాజాగా అడవి శేషుతో కలిసి మేజర్ అనే సినిమాలోనూ నటించింది.
ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది.
ఈ తెలుగమ్మాయి శోభితకు మలయాళంలోనూ మంచి పేరుంది.ఆమె తాజాగా నటించిన కురుప్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోతో నటించి మంచిపాపులారిటీ తెచ్చుకుంది.
తమిళంలో మణితర్నం మూవీ పొన్నియిన్ సెల్వన్ సినిమాతో అక్కడి జనాలకు పరిచయం కాబోతుంది.మొత్తంగా తెలుగమ్మాయి సౌత్ సినిమా పరిశ్రమను ఏలడం సంతోషకరం అని చెప్పుకోవచ్చు.