“ఖైరతాబాద్ గణేష్" గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? అలనాటి నుండి నేటివరకు ప్రతిష్టించిన విగ్రహాలు ఇవే..!

వినాయకచవితి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాం.ఎందుకంటే పండుగ అన్నింట్లోకెళ్లా వినాయకచవితి పండుగ కోలాహలమే వేరు.

విలేజ్ లలో అయితే ఊరిప్రజలందర్ని ఏకంచేసి జరుపుకునేలా చేస్తుంది.ఇక ఎవరి ఇళ్లల్లో వారుంటూ బిజీ బతుకులు బతికే పట్న ప్రజలను ఒక దగ్గరచేసి పండుగ జరుపుకునేలా చేస్తుంది.

బాల గంగాధర తిలక్ ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు.ఆ స్పూర్తితో ప్రారంభయిందే ఖైరతాబాద్ గణేశ్…1954లో అప్పటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది.

అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.ప్రస్తుతం మనం 51 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నాం.

చివరికి చేసే ఒక్క అడుగు విగ్రహం మేలిమి పసుపుతో చేస్తారట…ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.ఖైరతాబాద్ గణేశ్ గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు…

గణేశుడి తొలిరోజులు

తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు.1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

లడ్డూ విశిష్టత

ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు.2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు.ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.

మరిన్ని విషయాలు

ఓ సారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో నెల పాటు ట్యాంక్‌బండ్‌పై ఉంచారు.1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు వెలుగువెలిగాడు.కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.

విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ఏటా వైవిధ్యతను చాటుతున్నారు.ఇప్పుడు సింగరి శంకరయ్యతో పాటు ఆయన సోదరుడు సింగరి సుదర్శన్‌ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.ఎన్నో ఏళ్లుగా ఆదరణ పొందుతున్న ఖైరతాబాద్ ప్రతిమల్లో కొన్ని ఇక్కడ మీకోసం…

Khairtabad Ganesh – 1954

Khairtabad Ganesh – 1969

Khairtabad Ganesh – 1981

Khairtabad Ganesh – 1982

Khairtabad Ganesh – 1983

Khairtabad Ganesh – 1985

Khairtabad Ganesh – 1986

Khairtabad Ganesh – 1988

Khairtabad Ganesh – 1989

Khairtabad Ganesh – 1990

Khairtabad Ganesh – 1991

Khairtabad Ganesh – 1992

Khairtabad Ganesh – 1993

Khairtabad Ganesh – 1995

Khairtabad Ganesh – 1996

Khairtabad Ganesh – 1999

Khairtabad Ganesh – 2001

Khairtabad Ganesh – 2002

Khairtabad Ganesh – 2003

Khairtabad Ganesh – 2004

Khairtabad Ganesh – 2006

Khairtabad Ganesh – 2008

Khairtabad Ganesh – 2009

Khairtabad Ganesh – 2010

Khairtabad Ganesh – 2012

Khairtabad Ganesh – 2013

Khairtabad Ganesh – 2014

Khairtabad Ganesh – 2016

Khairtabad Ganesh – 2017

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube