ఎంఎస్ ధోని సినిమాలో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి బాలీవుడ్ వర్గాలను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఆయన మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవ్వడంతో సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది.
సిబిఐ ఎంక్వైరీ లో ఆయన సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.ముఖ్యంగా ఆయన కొన్ని చెడు అలవాట్లు కూడా బయటకు రావడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చనిపోయిన తర్వాత అతడి గురించి వస్తున్న వార్తల కారణంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సహజంగా ఎవరైనా బతికున్నప్పుడు నేటివ్ టాక్ తెచ్చుకున్నా చనిపోయిన తర్వాత మాత్రం అందరం వారిని పాజిటివ్ గా అంటే మంచి వారు గానే అంటూ ఉంటారు కానీ సుశాంత్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ గా అనిపిస్తుంది.
ఇప్పటికే ఆయన డ్రగ్స్ తీసుకునే వాడని వెల్లడయింది.రోజులో నాలుగు సార్లు ఆయన డ్రగ్స్ తీసుకోకుండా బయటికి వెళ్లే వాడు కాదు అంటూ రియా వెల్లడించింది.ఇక ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న హీరోయిన్స్ కూడా అతడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టుగా చెప్పారు.
సారా అలీ ఖాన్ మాట్లాడుతూ తాను గతంలో సుశాంత్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా చెప్పింది.
మేము ఇద్దరం కలిసి హాలీడే ట్రిప్ కు కూడా వెళ్లామని పేర్కొంది.అయితే అతనితో చాలా త్వరగానే విడిపోయాను అని అందుకు కారణాలు తన వ్యక్తిగతమని చెప్పింది.
అంతకు ముందు అంకిత సుశాంత్ లు దాదాపు నాలుగైదు ఏళ్లు ప్రేమించుకున్నారు.కానీ అనూహ్యంగా ఆమె నుండి విడిపోయిన తర్వాత సారా అలీ ఖాన్ తో ప్రేమలో పడ్డాడు.
ఆమె నుండి విడిపోయిన తర్వాత రియా చక్రవర్తి తో ప్రేమలో పడ్డాడు.ఆమె ప్రేమ విఫలం కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటూ అభిమానులు మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.