బాజీరావ్ మస్తానీ లో దీవానీ మస్తానీ పాట.పద్మావత్ సినిమాలో ఘూమర్ సాంగ్.
శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ప్రణవాలయ పాహి పాట ఎంత పేరు పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ పాటలు మ్యూజికల్ హిట్స్ గా నిలవడానికి కారణం లిరిక్సే, అద్భుత గాత్రమే కాదు.
అంతకు మించి డ్యాన్స్ కంపోజిషన్.ఈ పాటలో వేసే ప్రతి స్టెప్ ప్రేక్షకులు కళ్లార్పకుండా చూసేలా చేస్తుంది.
అంతటి గొప్ప పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన మాస్టర్ గురించి జనాలకు మాత్రం అంతగా తెలియదు.కారణం ఆమె ఎక్కువ పబ్లిసిటీ కోరుకోదు.
ఇంతకీ తను ఎవరో కాదు.క్రుతి మహేష్ మిద్య.
తను చదివిన చదువు.చేసే పనికి అస్సలు పొంతనే లేదు.
ఇంతకీ తన బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
క్రుతి మహేష్ మిద్య ముంబైలోని తమిళ బ్రాహ్మణ కుటుంలో జన్మించింది.
మధ్య తరగతి.ఇద్దరు అక్కాచెల్లెళ్లు.
తాజాగా ఈమె అద్భుత కంపోజ్ తో తెరకెక్కిన పాట శ్యామ్ సింగ రాయ్ సినిమాలోని ప్రణవాలయ పాహి.సాయి పల్లవి గ్రూప్ చేసిన ఈ పాట డ్యాన్స్ అద్భుతం అనిపిస్తుంది.
అయితే ఈ పాట విషయంలో తనకు క్రెడిట్ ఇవ్వలేదనే విషయం తనకు తెలిసింది.ఈ విషయం తెలిసి తనకు నవ్వు వచ్చినట్లు వెల్లడించింది.
నా డ్యాన్స్ ఆడ నెమలి ఆడినట్లు ఉంటుందని చెప్పిన ప్రశంసలతో పాటు పలు హిందీ పాటలకు జాతీయ అవార్డులు అందుకున్నట్లుగానే కొన్ని అవమానాలు కూడా ఎదురైనట్లు చెప్పింది.అందులో ఇది కూడా ఒకటి అనుకోవచ్చని చెప్పింది.
ఏడేళ్ల వయసులో శాస్త్రీయ న్రుత్యం నేర్పించాలని అమ్మ ప్రయత్నించినా.డ్యాన్స్ టీచర్ ను చూసి భయమేసినట్లు వెల్లడించింది.ఆ తర్వాత మరో మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటే చాలా సంతోషంగా ఫీలైనట్లు చెప్పింది.అదే సమయంలో తాను ఫోరెన్సిక్ సైన్స్ లో పీజీ కోసం లండన్ వెళ్లినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత చాలా కాలం పాటు డ్యాన్సుకు దూరం అయినట్లు చెప్పింది.ఆ తర్వాత తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియాకు వచ్చింది.
అనంతరం ఇండియా డ్యాన్స్ లో ఆడిషన్ కు వెళ్లి సెలెక్ట్ అయినట్లు చెప్పారు.ఆ తర్వాత తన డ్యాన్సుకు జడ్జీలతో పాటు ప్రేక్షకులు సైతం మంచి ప్రశంసలు కురిపించినట్లు చెప్పింది.ఆ తర్వాత రెమో డిసౌజా దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసి.బాజీరావ్ మస్తానీ, పద్మావత్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో డ్యాన్స్ కంపోజర్ గా వర్క్ చేసినట్ల వెల్లడించింది.
పద్మావత్ పాటకు గాను జాతీయ అవార్డువచ్చినట్లు చెప్పింది.శ్యామ్ సింగ రాయ్ సినిమాలో పాటకు మంచి గుర్తింపు వచ్చినా తనకు తగిన క్రెడిట్ ఇవ్వకపోవడం పట్ల ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పింది.