బొమ్మరిల్లు సినిమాతో 2006లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భాస్కర్త న ఫస్ట్ మూవీతోనే బంపర్ హిట్ కొట్టాడు.మొదటి సినిమాకే బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డు అందుకున్నాడు.ఆ తర్వాత అల్లు అర్జున్ తో పరుగు సినిమా తీశాడు.2010లో రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమాను డైరెక్ట్ చేశాడు.ఈ మూవీ కథ అద్భుతంగా ఉన్నా.ఎంతో ఆడియన్స్కు సరిగ్గా కనెక్ట్ కాలేదు.ఆ తర్వాత రామ్తో ఒంగోలు గొత్త మూవీ చేసిన ఈ డైరెక్టర్ తాజాగా అక్కినేని అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీ తీశాడు.ఈ మూవీ హిట్ టాక్ను సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు మంచి హిట్లేని అఖిల్కు బంపర్ హిట్ సినిమాను అందించాడు డైరెక్టర్ భాస్కర్.
తమిళనాడుకు చెందిన ఈ డైరెక్టర్.
ఓ తెలుగు అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.వారిది లవ్ మ్యారేజ్ అనే విషయం ఆ తక్కువ మందిలో చాలా మందికి తెలియదు.
బొమ్మరిల్లు సినిమాతో మంచి హిట్ అందించిన భాస్కర్కు అప్పుడే పెళ్లి చేద్దామని వాళ్ల నాన్న సంబంధాలు చూడటం మొదలు పెట్టాడట.
ఒక రోజు భాస్కర్తో అతని తండ్రి మాట్లాడారు.వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలని, లేదంటే చాలా ఆలస్యమైపోతుందని చెప్పారు.ఆ తర్వాతి రోజు ఒక అమ్మాయితో భాస్కర్ మ్యారేజ్ ఫిక్స్ చేశారు.
వారంలోనే పెళ్లి అంటూ భాస్కర్ తండ్రి బాంబ్ పేల్చాడు.ఇక ఆలస్యం చేయొద్దని భావించిన భాస్కర్.
తన తండ్రికి ఫోన్ చేసి తన లవ్ మ్యాటర్ చెప్పేశాడు.అరసవెల్లిలో తాము మ్యారేజ్ చేసుకుంటున్నానని మీరందరూ వెంటనే వచ్చేయండని చెప్పే సరికి అతని తండ్రి ఒక్క సారిగా షాకయ్యాడు.
అనంతరం అందరి సమక్షంలో భాస్కర్ పెళ్లి చేసుకున్నాడు.అని భార్య పేరు గౌరి శ్రీవిద్య.
తనది విజయనగరం.