ప్రస్తుత కాలంలో చాలా చోట్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడపిల్లల మీద రకరకాలుగా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.ఎన్ని శిక్షలు వేస్తున్నా మరెన్నో ఆంక్షలు విదిస్తున్నా కూడా ఈ అరాచకాలు ఆగటం లేదు.
ఇలాంటి వార్తలు విన్నా చుసినా అయ్యో పాపం అనటం తప్ప చేయగలిగింది కూడా ఏమి లేదు.అలాంటిదే సొంత వారికే అలా జరిగితే యెంతగా అల్లాడిపోతామో మాటల్లో చెప్పలేము.
అంతేకాదు అది మన వాళ్ళ వల్ల జరిగితే కోపంతో పాటు బాధగా ఉంటుంది తన లైఫ్ ఏం అయిపోతుందో అని, అచ్చం ఇలాంటిదే ఒక స్టార్ హీరోయిన్ జీవితంలో జరిగింది.తనతో పాటు ఏడు అడుగులు వేసి జీవితాంతం తనకి తోడుగా నిలవాల్సిన వ్యక్తి తన ఫ్రెండ్ నే వేధిస్తుంటే ఆ స్టార్ హీరోయిన్ ఏం చేసిందనేది మనం ఎప్పుడు తెల్సుకుందాం.
ఆమె కూడా అందరి లాగే సాధారణ ఆడపిల్ల, సినిమాలలో నటిస్తూ ఉన్నత శిఖరాలను అందుకుంటున్న ఆమె తోటి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.భర్తింటి వారు ఇంటికి రానివ్వకపోయినా అన్నీ తానై భర్తను అందలమెక్కించి, తానే ఇంటికి పరిమితమై ఒక కుమార్తెకి జన్మనిచ్చింది.
కానీ తన 16 ఏళ్ళ వివాహ జీవితానికి తూట్లు పొడిచి అతగాడు మరో హీరోయిన్ ను ప్రేమించి విడాకులు ఇచ్చాడు.కుమార్తెతో బయటకి వచ్చి మళ్లీ సినిమాలలో నటిస్తూ తన జీవితం తాను చూసుకుంటున్న సమయంలో ఒక అనుకోని ఘటన తన మాజీ భర్తను తానే దగ్గరుండి జైలుకి పంపేలా చేసింది.
మరి ఆ వనిత మరెవరో కాదు మంజు వారియర్ , ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రబుద్దుడు మరెవరో కాదు మలయాళ హీరో దిలీప్ నే, తన 16 సంవత్సరాల వయసులో సాక్ష్యం సినిమాతో సినీ రంగంలోకి తెరంగేట్రం చేసింది ఈ భామ.
కాగా ఆమె నటించిన సినిమాలు వరుసగా సల్లాపం, ఏ పళయుం కదన్ను, తూవల్ కొట్టరం, కలియట్టం, కృష్ణగుదియిల్ ఒరు ప్రనయకలదు, దయ, ప్రణయవర్ణంగళ్, సమ్మర్ ఇన్ బెత్లెహెం, కన్మదం, పత్రం, ది ప్రీస్ట్.అయితే “ఏ పళయుం కదన్ను” సినిమాలోని నటనకుగానూ మంజుకు కేరళ రాష్ట్రం ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది.అంతే కాదు ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలను అందుకుంది.
సినిమాలో నటిస్తున్న రోజుల్లో దిలీప్ తో ప్రేమలో పడి సర్వం తన కుటుంబం కోసం దారపోసింది.అయితే కావ్య మాధవన్ ప్రేమ మత్తులో పడిన దిలీప్ కు మజా ప్రేమ అర్థం కాక తనని వదిలించుకున్నారు.
అయినా నిరుత్సహ పడని మంజు 2016 లో విడాకులు తీసుకుని కుమార్తె మీనాక్షిని తీసుకుని ఇంటి నుండి బయటకి వచ్చి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది.మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యి తను ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకుంటుంది.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా, మంజు స్నేహితురాలు అలాగే ప్రముఖ నటి అయిన భావన కిడ్నాప్ కావడం అలాగే లైంగిక వేదనకు గురికావటం మలయాళ ఇండస్ట్రీ తోపాటు సౌత్ ని కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.అయితే భావనకు జరిగిన అన్యాయానికి మలయాళ ఇండస్ట్రీతో పాటు మంజు కూడా నిందితులను కఠినంగా డిమాండ్ చేసింది.కానీ విచారణలో భాగంగా తన మాజీ భర్త ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడని తెల్సి ఒక్క సారిగా షాక్ కి గురి అయ్యింది.ఇంతటి విషాదం నుండి తేరుకోగానే తప్పు చేసింది తన భర్త అయినా సరే శిక్ష పడటానికి పోరాటం చేసింది.
తన మరో స్నేహితురాలైన విచారణ అధికారికి సహాయం చేసి చివరకి తన భర్తని జైలుకు పంపే వరకు పోరాటం చేసింది.తప్పు చేసింది తన మనిషైనా సరే శిక్ష పడే వరకు పోరాడిన ధైర్య శాలిగా మంజు వారియర్ చరిత్రలో నిలిచింది.