వేసవి కాలం వచ్చేసింది, ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు మండి పోతున్నాయి.ఈ రెండు నెలల పాటు ఎండలు దంచి కొట్టడం ఖాయం అంటూ వాతావరణ నిపుణులు అంటున్నారు.
అత్యంత వేడిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందే వాతావరణ శాఖ ప్రకటించింది.ఇలాంటి సమయంలో డ్యూటీ మీద తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారు, ఇతరులు కూడా ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఎందుకు వెళ్లినప్పుడు నిమ్మరకం వంటివి తాగితే తప్పకుండా ఉపశమనం కలుగుతుందని మనకు తెలుసు.అయితే కొబ్బరి నీళ్ల వల్ల ఈ ఎండాకాలం చాలా మంచి జరుగుతుందని నిపుణులు అంటున్నారు.ఎండాకాలంలో కొబ్బరి బోండాలు తాగాలనిపించకున్నా తాగాలని, గుండెతో పాటు పలు సమస్యలకు కొబ్బరి నీళ్లు చాలా మంచివి అంటూ నిపుణులు చెబుతున్నారు.కొబ్బరి నీటి వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు వేసవి కాలం డీహైడ్రేషన్ బారి నుండి కూడా బయట పడవచ్చు.
కొబ్బరి బోండాం ఉపయోగాలు కొన్ని చూద్దాం :
హార్ట్ పేషంట్స్ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎండాకాలం చాలా మంచిది.ఎండకు వారి గుండె ఇబ్బంది పడకుండా ఉంటుంది కిడ్నీలోని రాళ్లతో బాధపడుతున్న వారు రోజుకు కనీసం రెండు లేదా మూడు కొబ్బరి బోండాల నీళ్లు తాగితే రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది అధిక బరువుతో బాధపడేవారు కొబ్బరి బోండా నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అజీర్తి మరియు ఇతర జీర్ణ సమస్యలకు కూడా కొబ్బరి నీళ్లు మంచి ఔషదంగా వర్క్ అవుతాయి
చర్మకాంతి రెట్టింపు అయ్యేలా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి బోండా తాగడం వల్ల తక్షణం శక్తి వస్తుంది. కొబ్బరి బోండాలో ఒక సెలైన్ బాటిల్లో ఉండేన్ని మినరల్స్ మరియు పోషకాలు ఉంటాయని వెళ్లడయ్యింది.
అందుకే తప్పకుండా ఈ వేసవిలోనే కాకుండా ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు తప్పకుండా కొబ్బరి బోండాను తాగండి, ఈ విషయాన్ని స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి.