ఇండియన్ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారుచేసే పూణే రాష్ట్రానికి చెందిన సీరం ఇన్స్టిట్యూట్లో నిన్న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.మొదటి టెర్మినల్ గేటు వద్ద భవనంలో రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు మృతి చెందటంతో ఈ దుర్ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇటువంటి తరుణంలో ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించడం జరిగింది.
పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని తెలిపింది.
అంతేకాకుండా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్.స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.వెంటనే ఈ ఘటనపై భారత ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదం వల్ల వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని కంపెనీ సీఈఓ స్పష్టం చేయడం జరిగింది.మరోపక్క అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అన్నదానిపై విచారణ చేపడుతున్న అధికారులు కంపెనీ లో జరుగుతున్న వెల్డింగ్ పనులే కారణమని ఓ అంచనాకు వచ్చారు.