మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్.అతని కెరియర్ చూసుకుంటే వరుసగా మూడు హిట్స్, ఆపై ఆరు డిజాస్టర్స్ మళ్ళీ వరుసగా రెండు హిట్స్ సినిమాలతో ట్రాక్ నడిపిస్తున్నాడు.
కమర్షియల్ హీరోగా తన మార్క్ చూపించుకున్న తేజ్ త్వరలో సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.దీంతో పాటు ప్రస్తానం ఫేమ్ దేవాకట్టా దర్శకత్వంలో సోషల్ ఎలిమెంట్ విత్ కమర్షియల్ జోనర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తేజ్ కి జోడీగా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక హాట్ టాపిక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.
ఇందులో తేజ్ యువ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
సోషల్ ఎలిమెంట్ తోకూడిన పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.ఈ కథని దేవాకట్టా ముందుగా చిరంజీవికి చెప్పడం జరిగిందని, దానిని మెగాస్టార్ ఫైనల్ చేసి తేజ్ కి వర్క్ అవుట్ అవుతుందని సూచించడంతో ఫైనలైజ్ అయ్యిందని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాకి రిపబ్లిక్ అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.త్వరలో ఈ టైటిల్ కి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని, అలాగే సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.
దేవాకట్టా ప్రస్తానంతో హిట్ కొట్టి తరువాత కొంత వరకు గాడి తప్పి మళ్ళీ తేజ్ సినిమాతో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.అతనికి ఎంత వరకు సక్సెస్ దొరుకుతుంది అనేది వేచి చూడాలి.