రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను పొగడటం అనేది ఆ పార్టీలకు పెద్ద బలాన్ని ఇచ్చే అంశం.అందుకే ఇప్పటి రాజకీయాల్లో ఎంత మంచి పని చేసినా సరే.
దాన్ని ప్రశంసించకుండా.మిగిలిన సమస్యలపై మాత్రమే గళమెత్తుతారు రాజకీయ పార్టీలు.
ఈ సూత్రం అన్ని పార్టీలకు వర్తిస్తుంది.అయితే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ ఎస్తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ కొంత చతికిల పడుతోంది.
టీఆర్ ఎస్ పై నిత్యం విమర్శలు గుప్పించే రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కేంద్ర పెద్దలు లేని తలనొప్పులు తెస్తున్నారంట.
టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు రాష్ట్ర బీజేపీనేతలు బాగానే ట్రై చేస్తున్నారు.
కానీ కేంద్ర మంత్రుల కొన్ని సార్లు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను మెచ్చుకోవడంతో వాటినే చూపించి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు టీఆర్ ఎస్ నేతలు.మీ కేంద్ర మంత్రులే మమ్మల్ని పొగుడుతున్నారంటూ చెప్తూ.
స్టేట్ బీజేపీకి సవాళ్లు విసురుతున్నారు.దీంతో టీఆర్ ఎస్ ప్రశ్నలకు బీజేపీ నేతలు ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఇప్పుడు తాజాగా కేంద్ర పెద్దలు ఇలాంటి పనే చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ఫీవర్ సర్వేను కేంద్ర బీజేపీ పెద్దలు మెచ్చుకున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా మరోసారి హరీశ్ రావు ఆధ్వర్యంలో తెలంగాణలో ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నారు.అయితే ఈ ఫీవర్ సర్వే బాగుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు.
దీంతో ఈ వ్యాఖ్యలను హరీశ్ రావు అండ్ కో ప్రజల్లోకి తీసుకెల్లే పనిలో పడ్డారు.దీన్ని ఆధారంగా చూపించి తమ పని తనం ఏంటో బీజేపీ పెద్దలే చెబుతున్నారని అంటున్నారు టీఆర్ ఎస్ లీడర్లు.
మొత్తానికి బీజేపీ కేంద్ర పెద్దలు చేస్తున్న స్టేట్ మెంట్లు రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
.