ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల మాదిరిగానే మహారాష్ట్ర రాజకీయాలు కూడా భగ్గుమంటున్నాయి అంటున్నారు విశ్లేషకులు.అదీగాక ఇక్కడ త్రీముఖ పోరు కూడా ఉంది.
అవినీతి ఆరోపణలతో పాటుగా, విమర్శల రాళ్లు రువ్వుకోవడాలు, అసంతృప్తి సెగలు సర్వసాధారణమే.
ఈ నేపధ్యంలో గత కొద్ది రోజుల క్రితం ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు దొరకడంతో ఈ అంశం రాజకీయ దుమారానికి తెరలేపింది.
ప్రస్తుతానికి ఇదే అంశం మీద కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వెంటనే ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి నుండి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
సీఎంగా కొనసాగే అర్హత ఠాక్రేకు లేదని విమర్శించారు.
ఒకపక్క ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో ఓ పోలీసు ఉద్యోగే బాంబులు పెట్టానని చెబుతుంటే ఈ విషయం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని, ఇలాంటి చర్యల వల్ల పోలీసుల పట్ల నమ్మకాన్ని కోల్పోవలసి వస్తుందని, పోలీసులే ఇలా చేస్తే ఎవరిని నమ్మాలంటూ ప్రశ్నించారు.ఈ విషయంలో మహారాష్ట్ర పోలీసు ఉగ్రవాద నిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది.ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేవి పరిగణించ బడతాయంటూ విమర్శించారు.