గోమూత్రం,పేడ మాత్రమే కాదు ఎండలో నిలబడినా కరోనా మాయమట

కరోనా పేరు వినగానే ప్రపంచ దేశాలే గడగడలాడుతున్నాయి.అయితే అలాంటి ఈ మహమ్మారి వైరస్ ను అరికట్టడానికి దేశాలు నానా తిప్పలు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం చేసే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

 Union Minister Of State For Health And Family Welfare Ashwin Kumar Choubey-TeluguStop.com

ఇటీవలే కొందరు బీజేపీ నేతలు కరోనా ను అరికట్టాలి అంటే గో మూత్రం,గో పేడ చక్కగా పనిచేస్తాయి అంటూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలు పాలైన విషయం తెలిసిందే.అయితే ఇంకా వ్యాఖ్యలపై రేగిన దుమారం సద్దుమణగక ముందే కేంద్ర మంత్రి సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం.

ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ కరోనాను అరికట్టడానికి పలు సూచనలు చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.కరోనా అరికట్టాలి అంటే ప్రజలు 15 నిమిషాల పాటు ఎండలో నిలబడాలి.

దీంతో డీ విటమిన్ వస్తుంది.వ్యాధి నిరోధకత పెరుగుతుంది.

కరోనా వంటి వైరస్‌లను చంపేస్తుంది అని అంటూ ఆయన చెప్పుకొచ్చారు.దీనితో నెటిజన్లు మంత్రిగారిని ఒక ఆట ఆడుకున్నారు.

Telugu Ashwinkumar, Welfareashwin-Latest News - Telugu

మీరు ఏ చదువులు చదివారో చెబుతారా?’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా ,ఈ రోజు ప్రధాని జాతినుద్దేశించి ఇవ్వనున్న సందేశంలోనూ ఈ అంశం ఉంటుందేమో! అని అంటూ ఒకరు కామెంట్ చేశారు.ఇంకొందరు అయితే ఎండలో నిలబడితే వైరస్‌లన్నీ చచ్చిపోతే ఇటలీలో ఇదే పని చేసేవారుగా? అని అంటూ ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి కరోనా వైరస్ విషయంలో కూడా బీజేపీ నేతలు గోమూత్రం,గో పేడ వాడాలి అంటూ సలహాలు ఇవ్వడం మాత్రం విమర్శల పాలవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube