కేసీఆర్ గుట్టు రట్టు చేసిన కిషన్ రెడ్డి.. అదేంటంటే?

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది.మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ఉధ్రుతంగా కొనసాగుతూ జనాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

 Union Minister Kishan Reddy Who Slammed Kcr Over Corona Deaths , Kcr, Bjp Party,-TeluguStop.com

అయితే కరోనా వేవ్ మొదలైన మొదటి దశ నుండి ప్రభుత్వం మీద ఒక అపవాదు అంతటా చర్చనీయాంశంగా మారింది.అయితే ప్రభుత్వం కరోనా లెక్కలను దాచి పెడుతోoదని మొదటి నుండి విమర్శిస్తున్నా జిల్లాలలో నమోదవుతున్న కేసులకు ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ లలో ప్రస్థావిస్తున్న కేసులకు ఏమీ పొంతన ఉండటం లేదు.

అయితే కేసీఆర్ ఈ లెక్కలు దాచడం వెనుక కరోనా కాలంలో ప్రజలను భయంభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని చెప్పి లెక్కలు దాస్తున్నాం అని చెప్పి కేసీఆర్ తన సొంత మీడియా పరోక్షంగా ప్రచారం చేయిస్తున్నట్టుగా అప్పట్లో అంతర్గత రాజకీయాలలో ప్రచారం జరిగింది.అయితే కరోనా కేసులు దాచడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాడు.

  మరణాలు దాచడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు.మరణాలు తగ్గించి చూపడం వలన సమస్యలేవీ రావని, కేసీఆర్ మరణాలు ఎందుకు దాస్తున్నాడంటే తన పార్టీ ప్రతిష్టత గురించి అంతర్గతంగా మదనపడుతున్నాడు.

కేసీఆర్ మరణాల వివరాలు చెబితే ప్రజలకు వాస్తవంగా కోవిడ్ విజృంభణ ఎంత ఉంది అనే విషయం బహిర్గతమవుతుందని, లేకపోతే ప్రజల్లో మానసికంగా భయానికి లోనవుతారని కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube