తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది.మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ఉధ్రుతంగా కొనసాగుతూ జనాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
అయితే కరోనా వేవ్ మొదలైన మొదటి దశ నుండి ప్రభుత్వం మీద ఒక అపవాదు అంతటా చర్చనీయాంశంగా మారింది.అయితే ప్రభుత్వం కరోనా లెక్కలను దాచి పెడుతోoదని మొదటి నుండి విమర్శిస్తున్నా జిల్లాలలో నమోదవుతున్న కేసులకు ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ లలో ప్రస్థావిస్తున్న కేసులకు ఏమీ పొంతన ఉండటం లేదు.
అయితే కేసీఆర్ ఈ లెక్కలు దాచడం వెనుక కరోనా కాలంలో ప్రజలను భయంభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని చెప్పి లెక్కలు దాస్తున్నాం అని చెప్పి కేసీఆర్ తన సొంత మీడియా పరోక్షంగా ప్రచారం చేయిస్తున్నట్టుగా అప్పట్లో అంతర్గత రాజకీయాలలో ప్రచారం జరిగింది.అయితే కరోనా కేసులు దాచడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాడు.
మరణాలు దాచడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు.మరణాలు తగ్గించి చూపడం వలన సమస్యలేవీ రావని, కేసీఆర్ మరణాలు ఎందుకు దాస్తున్నాడంటే తన పార్టీ ప్రతిష్టత గురించి అంతర్గతంగా మదనపడుతున్నాడు.
కేసీఆర్ మరణాల వివరాలు చెబితే ప్రజలకు వాస్తవంగా కోవిడ్ విజృంభణ ఎంత ఉంది అనే విషయం బహిర్గతమవుతుందని, లేకపోతే ప్రజల్లో మానసికంగా భయానికి లోనవుతారని కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.