బిజెపి పార్టీలో సామాన్య కార్యకర్తగా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిన కిషన్ రెడ్డి నేడు కేంద్రమంత్రి పదవి అధిరోహించి చడంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కిషన్ రెడ్డి.
మీడియా సమావేశం నిర్వహించి ప్రధాని మోడీ ఎటువంటి శాఖ ఇచ్చిన పూర్తిగా బాధ్యత వహించి పనిచేస్తానని నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా కిషన్ రెడ్డికి… కేంద్రం సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మరియు నార్త్ ఈస్ట్ న్.రీజియన్ డెవలప్మెంట్ బాధ్యతలను అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు.
మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కచ్చితంగా సహకరించేలా వ్యవహరిస్తామని కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.కిషన్ రెడ్డి కి ఏకంగా మూడు శాఖలు కేటాయించడంతో.
బిజెపి పార్టీలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది.ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలలో కేంద్ర క్యాబినెట్ మంత్రి మొదట వెంకయ్యనాయుడు కి వరించగా ఆ తర్వాత కిషన్ రెడ్డి కి దక్కటం జరిగింది.