దేశంలో మొదటి సారిగా కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి పై ఎలాంటి అవగహన లేకున్నా దీని బారిన పడ్దవారిలో ప్రముఖులు చాలా తక్కువ మంది ఉన్నారు.కానీ సెకండ్ వేవ్లా ప్రవేశించిన ఈ కోవిడ్ మాత్రం ముఖ్యంగా పొలిటికల్, సినిమా రంగాల్లో ఉన్న ప్రముఖులను ఎవరిని వదలడం లేదు.
దీని బారిన పడుతున్న సంఖ్య రోజురోజుకు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక పొలిటికల్, చిత్ర రంగాల్లో ఉన్న వారు ఎక్కువగా ప్రజలతో ప్రజలను కమ్యూనికేట్ అవడం వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది.
ఇకపోతే తాజాగా మరో ప్రముఖ రాజకీయ నేత కరోనా బారిన పడినాడట.ఆయనే కేంద్ర కార్మికశాఖ మంత్రిసంతోష్ గంగ్వార్.
ఈయనకు కరోనా సోకగానే ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.ఈ క్రమంలో ‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
అయితే ఎలాంటి కరోనా లక్షణాలు లేవు.కానీ గత కొద్దిరోజుల్లో నన్ను కలిసిన వారందరు కూడా కరోనా టెస్టులు చేయించుకోండని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.