సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!!

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు మరియు సినిమా సెలబ్రిటీలు పాల్గొనడం జరిగింది.ప్రపంచం లో కూర్చున్న విగ్రహాలలో రెండో అతిపెద్ద విగ్రహం గా సమతా మూర్తి విగ్రహం రికార్డు సృష్టించింది.

 Union Home Minister Amit Shah Visits Samata Murthy Statue, Amith Shah, Hyderabad-TeluguStop.com

ప్రధాని మోడీ ఆవిష్కరించిన ఈ విగ్రహాన్ని సందర్శించడానికి చాలా మంది జనాలు వస్తున్నారు.శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ అదేవిధంగా ఏపీ సీఎం జగన్ మరియు ఇంకా వివిధ పార్టీల రాజకీయ నేతలు పాల్గొనడం జరిగింది.

అయితే తాజాగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సంప్రదాయ పద్ధతులలో పంచకట్టు… తిరునామం తో అమిత్ షా వచ్చారు.చిన్న జీయర్ స్వామి అమిత్ షా కి ఘనస్వాగతం పలికారు.

ఈ సమయంలో చిన్న జీయర్ స్వామి ఆశ్రమం గురించి అనేక విషయాలు తెలియజేశారు.సమాజంలో మనుషులంతా ఒక్కటేనని శ్రీ రామానుజలు చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తన ప్రసంగంలో తెలిపారు.

మనుషులంతా ఒకటేనని సనాతన ధర్మం అన్నిటికీ మూలం అని పేర్కొన్నారు.

Union Home Minister Amit Shah Visits Samata Murthy Statue Amith Shah, Hyderabad - Telugu Amith Shah, Hyderabad

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube