దేశ ప్రజలు అంత ఎంతో ఉత్కంఠంగా ఎదురు చుసిన కేంద్ర బడ్జెట్ ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు.అయితే ఈ బడ్జెట్ లో ఎవరు ఊహించని రీతిలో కొన్ని రంగాలపై వరాలు కురిపిస్తే.
మరికొన్ని రంగాలకు ముండి చెయ్యి చూపారు.ఇంకా అలానే ఈ కేంద్ర బడ్జెట్ లో కొన్నింటిపై ధరలు భారీగా పెంచితే మరికొన్ని భారీగా తగ్గించారు.
అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
అయితే ఈ బడ్జెట్ లో ధరలు బాగా పెరుగుతున్నవి ఇవే.ఫర్నీచర్, చెప్పులు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, వైద్య పరికరాలు, వంట గదిలో వాడే వస్తువులు, క్లే ఐరన్, స్టీలు, కాపర్, సోయా ఫైబర్, సోయా ప్రోటీన్, కమర్షియల్ వాహనాల విడిభాగాలు, స్కిమ్డ్ మిల్క్, వాల్ ఫ్యాన్స్, టేబుల్వేర్ వీటిపై ధరలు భారీగా పెరగనున్నాయి.
ఇంకా ఈ బడ్జెట్ తో భారీగా ధరలు తగ్గుతున్నవి ఇవే.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ పై పన్ను తగ్గింపు, ఎలక్ట్రిక్ వాహనాలుపై, మొబైల్ ఫోన్ల విడి భాగాలపై పన్ను తగ్గించనున్నారు.ఇంకా చివరిది ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకుపై కూడా కస్టమ్స్ పన్ను తగ్గించనుంది.
.