సిపి పార్టీ లో మంత్రి కొడాలి నాని మాట తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.చంద్రబాబును విమర్శించాలన్నా టిడిపి పార్టీలో కీలక నాయకులను టార్గెట్ చేయాలన్న చాలావరకు వైసీపీ కొడాలి నాని ద్వారా దిమ్మ తిరిగి రిప్లై లు ఇస్తూ ఉంటది.
అటువంటి కొడాలి నాని ని సరికొత్తగా టార్గెట్ చేశారు టిడిపిలో ఊహించని క్యాండెట్.మేటర్ లోకి వెళ్తే జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జెసి పవన్ రెడ్డి కొడాలి నాని పై ఊహించని విధంగా కామెంట్లు చేశారు.
టిడిపి పార్టీ నాయకుడు పట్టాభి పై జరిగిన దాడి విషయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన నోరు ఫినాయిల్ తో శుభ్రం చేసుకుంటే బాగుంటుందని, అప్పుడు ఆయన నోటి నుంచి మంచి మాటలు వస్తాయేమో అన్న రీతిలో జెసి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.పట్టాభి పై దాడికి పాల్పడింది వైసిపి పార్టీ నాయకులు అని ఆరోపించారు.అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని, దీనికిగాను వైసీపీ ఎంపీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్ విషయంలో రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన విజయసాయిరెడ్డి తూతూమంత్రంగా స్పందించటం దారుణమని విమర్శించారు.వైసిపి పార్టీ వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
అంతేకాకుండా పెట్రోల్ మరియు డీజిల్, మద్యం ధరలు పెంచి ప్రజల నుంచి దోచుకుంటున్నారని జేసీ పవన్ రెడ్డి మండిపడ్డారు.
.