వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం.తెలంగాణ నిరుద్యోగుల కోసం.
నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాలలో చేపడుతున్న ఈ దీక్ష రేపు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం.
లింగాపూర్ లో దీక్ష చేపట్టాలని డిసైడ్ అయ్యారు.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి నిరుద్యోగి.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని.పరామర్శించడానికి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇటువంటి క్రమంలో ఆత్మహత్య చేసుకున్న ఆ నిరుద్యోగి కుటుంబం తండ్రి భూక్య శంకర్ నాయక్.వైయస్ షర్మిల తన ఇంటికి రాకూడదని.విజ్ఞప్తి చేశారు.తన కొడుకు ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే కానీ మా కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న మా కొడుకు.
చావుని రాజకీయం చేయవద్దు అంటూ వైఎస్ షర్మిల కి విజ్ఞప్తి చేస్తూ వీడియో.పోస్ట్ చేశారు సదరు నిరుద్యోగి తండ్రి భూక్య శంకర్ నాయక్.
ఈ పరిణామంతో వైయస్ షర్మిల కు అదే రీతిలో పార్టీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది.ఇటువంటి తరుణంలో రేపు దీక్ష జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.