తెలంగాణలో కాంగ్రెస్ డక్కిమొక్కీలు తింటు పార్టీని ఫాం లోకి తేవడానికి తెగ శ్రమపడుతుందన్న విషయం తెలిసిందే.ఇప్పటికే రేవంత్ రెడ్డి తన మాటలతో పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అదీగాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనంగా మారుతోందన్న ప్రచారం కూడా జరుగుతుంది.
ఈ సమయంలో తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ కి మరో ఊహించని షాక్ తగిలింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.తన రాజీనామా లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపిన శ్రీశైలం ఢిల్లీకి బయలు దేరారట.
ఇకపోతే త్వరలో శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.ఈ నేపథ్యంలో శ్రీశైలం గౌడ్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయ నేతల్లో ఆసక్తికరంగా మారింది.అదీగాక ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రెడి అవుతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.