ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి వరుసగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు జరగడం ఫలితాలు రావడం జరిగాయి.
ఇలాంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో మందు బాబులకు ఊహించని షాక్ న్యూస్.అదేమిటంటే మార్చి 10వ తారీఖు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే మద్యం దుకాణాలు క్లోజ్ అవబోతున్నాయి.
ఈ పరిణామంతో మార్చి 8, 9, 10 వ తారీకులలో ఎక్కడ కూడా మద్యం అందుబాటులో ఉండదు.మార్చి 14వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో 13 కూడా మద్యం షాపులు క్లోజ్.
దీంతో మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఐదు రోజులు బంద్ కాబోతున్నాయి. ఈ దెబ్బతో ఐదు రోజుల పాటు మందుబాబులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్యం దొరికే పరిస్థితి లేదు అని చెప్పవచ్చు.