దేశంలో పోతున్న పరువును కాపాడుకోవడానికి కాంగ్రెస్ త్రీవంగా కృషి చేస్తుంది.ఆ పార్టీ పునాదులు పూర్తిగా కూలిపోకుండా ఉండడానికి రాహూల్ కూడా శ్రమిస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్కు దురదృష్టం వైఫైలా చుట్టే తిరుగుతుంది కావచ్చూ.
అసలే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించని దెబ్బ తగిలింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో రాజీనామా చేశారు.తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపినట్లు పీసీ చాకో వెల్లడించారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న చాకో గతంలో కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.అయితే ఏప్రిల్ ఆరవ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో చాకో రాజీనామా కీలకంగా మారింది.
ఇక కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కృషి చేస్తుండగా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి ఇష్టారీతిగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఏది ఏమైనా కొన్ని విషయాల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుని నేతలను అదుపులో పెట్టకుంటే ఇలాంటి పరిస్దితులే మరిన్ని తలెత్తే అవకాశాలున్నాయంటున్నారట విశ్లేషకులు.
.