త్వరలో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం గవర్నర్బా న్వరి లాల్ కి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.పంజాబ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధుని కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అమరీందర్ సింగ్ వర్గానికి… సిద్దు వర్గానికి చెందిన నాయకులకు మధ్య తీవ్ర ఆధిపత్యపోరు నడుస్తోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సపోర్ట్ ఎక్కువగా సిద్దూకి ఉండటంతో.అధ్యక్షుడు సిద్దూతో నెలకొన్న ఆధిపత్యపోరు చివరాకరికి అమరీందర్ సింగ్ నీ.సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితికి దాపురించింది.రాజీనామా చేయక ముందు తాను ముఖ్యమంత్రిగా కొనసాగలేనని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కి లెటర్ రాయడం జరిగింది.
సోనియా మాట ప్రకారం.అనేక అవమానాలను తట్టుకోవటం జరిగిందని, ఇంకా.
జరుగుతున్న అవమానాలు భరించడం నా వల్ల కాదు అంటూ పార్టీకి అదేరీతిలో సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం పంజాబ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.సరిగ్గా పంజాబ్ సీఎల్పీ భేటీ కి ముందు.
అమరీందర్ సింగ్.ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.