ఉత్తరాఖాండ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బిజెపి పార్టీలో జాయిన్ అయ్యారు.సరిగ్గా వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు జాయిన్ అయినా బిజెపి పార్టీ నాయకులను తిరిగి.
కమలనాథులు బీజేపీలో వచ్చే రీతిలో రాజకీయం చేస్తూ ఉన్నారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉంది.
పార్టీలో అంతర్గత విభేదాలు రాకుండా ఇప్పటికే ఐదేళ్ల కాలంలో మూడుసార్లు సీఎం పదవుల అభ్యర్థులను మార్చడం జరిగింది.
ఇదిలా ఉంటే అంతకు ముందు బిజెపి నుండి వెళ్ళిన నాయకులను తిరిగి మళ్ళీ బిజెపిలో చేరే విధంగా ఉత్తరాఖండ్ బీ.జే.పీ కీలక నాయకులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.దీనిలో భాగంగా పురోల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ .ఈరోజు బిజెపి పార్టీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ లో బీజేపీ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో జాయిన్ అయినట్టు స్పష్టం చేశారు.గతంలో 2007 నుండి 2012 వరకు రాజ్ కుమార్.
బిజెపి పార్టీలో కొనసాగారు.అయితే 2012 ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరి .2017 ఎన్నికలలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు.అటువంటి వ్యక్తి మళ్లీ బీజేపీలో జాయిన్ అవటంతో ఉత్తరాఖండ్ రాజకీయాలు వేడెక్కాయి.