తిరుపతి విమానాశ్రయం లో చంద్రబాబుకి ఊహించని షాక్..!!

పంచాయతీ ఎన్నికలలో టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడం మాత్రమే కాగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పరిస్థితి కూడా అదేరీతిలో ఉంది.దీంతో గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.

 Chandrababu,chitoor,kupam,tdp, Thirupathi Police Notices To Chandrababu In Airpo-TeluguStop.com

దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టి మరోసారి ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా పార్టీ ఏ విధంగా నడవాలి అన్నదానిపై కేడర్ తో చంద్రబాబు మమేకమవుతూ వస్తున్నారు.ఇలాంటి తరుణంలో చంద్రబాబు దీక్ష చేయాలని సంకల్పించిన క్రమంలో కరోనా నిబంధనలు అంటూ చిత్తూరులో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తిరుపతిలో సాయంత్రం నాలుగు గంటలకు ధర్నా చేయాలని తిరుపతి పర్యటన విచ్చేసిన చంద్రబాబు కు ఊహించని షాక్ పోలీసులు ఇచ్చారు.తిరుపతి నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవని నోటీసులు అందజేశారు.

తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు ని అడ్డుకోవడం జరిగింది.దీంతో అటు నుంచి అటే వెనక్కి పంపించే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

కాగా చంద్రబాబు ని అడ్డుకోవడంపై టీడీపీ పార్టీకి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులతో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది అంటూ మండిపడుతున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube