దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ప్రతాపం చూపించిన బీజేపీ ఇక తెలంగాణలో టీయార్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము తమకు వచ్చిందని భావించింది.ఈ క్రమంలో తమ దూకుడును హై స్పీడ్ లో పెంచింది.
కాని ఆ తర్వాత వస్తున్న వరుస ఎన్నికల్లో అంతగా పట్టు నిలుపుకోలేక పోతుంది.ఒకరకంగా కేంద్రం అవలంభిస్తున్న తీరు కావచ్చూ అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.దీనికి కారణం సాగర్ ఉప ఎన్నిక.కనీసం సాగర్లో అయిన గెలిచి తమ పరువు కాపాడుకుందాం అని భావిస్తున్న బీజేపీకి కూడా ఇక్కడ దెబ్బపడిందట.అంతే కాకుండా అవతలి పార్టీ నుంచి లాక్కోవడమేమోగానీ స్వంత పార్టీ నేతలు టీఆర్ఎస్లోకి వెళ్ళకుండా అడ్డుకోలేకపోతోంది.
ఈ క్రమంలో బీజేపీ నుండి కడారి అంజయ్య యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఇతని భార్య నివేదిత ఈ ముగ్గురూ టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట.హైదరాబాద్ వచ్చి తెలంగాణ భవన్లోనే టీఆర్ఎస్లో చేరవచ్చనే వార్తలు సాగర్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నాయట.
ఇక టీఆర్ఎస్ నుంచి బలమైన నేతను లాక్కుని బీజేపీ తరపున బరిలోకి దించాలని అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించింది.కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉండిపోయిందన్న చందంగా బీజేపీ పరిస్థితి ప్రస్తుతం మారింది.