ఎవరికైనా ఏదో ఒక విషయంలో అద్భుతం జరిగే ఉంటాయి.ఆ అద్భుతం జరిగింది అంటే దాని వెనక ఎవరో ఒకరు లేదా ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది.
చాలామందికి అద్భుతాలు ధనం రూపంలోనూ లేదా మరే ఇతర విషయంలోనైనా జరిగే ఉంటాయి.ఇలాంటి అద్భుతమే ఓ చోట జరిగిన విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
విజయనగరం జిల్లా, సాలూరు మండలం, శివరామ పురం గ్రామం జరిగిన అద్భుతం ఇది.ఈ గ్రామంలో దాదాపు 607 కుటుంబాలు నివసిస్తాయి.మొత్తం జనాభా 3000 మంది.కాగా అసలు విషయానికొస్తే ఆ గ్రామంలో ఉన్న జనాభాకు అదృష్టం నిజంగానే తలుపు తట్టింది.
ఆ గ్రామంలో నివసిస్తున్న 200 మంది జనాభాకు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడమే అద్భుతం.ఇందులో అద్భుతం ఏంటి అని అనుకుంటున్నారా.
అందులోనే అద్భుతం ఉంది.తమ బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అక్కడ ప్రజలకు అర్థం కావడం లేదు.
అంతే కాకుండా ప్రభుత్వం నుండి వస్తుంది అనుకుంటే అది పొరపాటే.రైతులకే కాకుండా చదువుతున్న విద్యార్థులకు తమ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి.
అవి ఏకంగా ఒక్కొక్కరికి 13,500 నుండి 16,000 వరకు తమ ఖాతాలో పడుతున్నాయి.
ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుందో ప్రభుత్వం కూడా అర్థం కావడం లేదు.
ఇలా ఎవరో ఒకరు లేదా ఇద్దరికి పడుతున్నాయి అంటే సహజమే అనుకోవచ్చు.కానీ ప్రతి ఒక్కరి ఖాతాలో పడడం.
అంతేకాకుండా వేలకొద్దీ డబ్బులు జమ కావడం నిజంగానే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.కాగా ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాయో లేదా ఎవరు వేస్తున్నారో అంటూ ప్రభుత్వం ఈ విషయం గురించి చర్చిస్తుంది.