మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు.భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని సమాచారం అందుతోంది.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమా సక్సెస్ సాధిస్తే ఖలేజా సినిమా నిరాశపరిచింది.అయితే ఖలేజా సినిమా థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచినా బుల్లితెరపై మాత్రం మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఈ సినిమా బడ్జెట్ లో 120 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ల కోసమే ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 150 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉండగా నాన్ థియేట్రికల్ హక్కులకు 150 కోట్ల రూపాయల ఆర్ వచ్చిందని బోగట్టా.
ఈ మొత్తం చిన్న ఆఫర్ అయితే కాదు.మేకర్స్ ఈ ఆఫర్ కు అంగీకరిస్తే రిలీజ్ కు ముందే ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల లాభం వచ్చినట్టు అవుతుందని చెప్పవచ్చు.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని మహేష్ అభిమానులు ఫిక్స్ అయ్యారు.ఈరోజు కృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చే అవకాశాలు అయితే లేవని సమాచారం అందుతోంది.