ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు.ఇదివరకు కాలంలో భారతదేశం లాంటి అభివృద్ధి చెందే దేశాలలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేది.
గత రెండు దశాబ్దాల నుంచి చదువుకునే వారి సంఖ్య పూర్తిగా పెరిగింది.అయితే కేవలం చదువుకున్నవారు మాత్రమే కాకుండా చదువుకోని వారు కూడా సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వారు చాలా మంది ఉన్నారు.
కేవలం చదువుకోవడం ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించవచ్చు.లేకపోతే లేదు అన్న భావనను పక్కనపెట్టి.
పేరు, డబ్బు సాధించాలని తపన, కష్టపడే తత్వం ఉంటే చాలని చెప్పే వారు ఎందరో ఉన్నారు.చేసే పని ఏదైనా సరే మనసు పెట్టి ఏకాగ్రతతో లక్ష్యం ప్రకారం ముందుకు వెళితే విజయం డబ్బు రెండు దాసోహం అవుతాయి.
ఇక అసలు విషయంలోకి వెళితే.
చదువుతో సంబంధం లేకుండా తన కలను నిజం చేసుకుంటూ నిరక్షరాస్యులైన ఓ 62 ఏళ్ల మహిళ సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా సంపాదిస్తోంది.
అది ఎలా అని అనుకుంటున్నారా.? అది కొత్త పని ఏమి కాదు.ఆవిడ చిన్నప్పుడు నుంచి తనకు అలవాటు ఉన్న పని.కేవలం గేదెల ద్వారా వచ్చే పాలను వాటి నుంచి తయారయ్యే ఉత్పత్తులను అమ్మి సంవత్సరానికి కోటి పది లక్షల రూపాయలను సంపాదించింది.ఈ క్రమంలో ఆమె కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ సాధించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు.గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలోని నాగానా గ్రామానికి చెందిన చౌదరి నవల్ బెన్ దల్సంగ్ బాయి ఈ ఘనతను సాధించారు.
కేవలం గేదెలు, ఆవులు పోషణ ద్వారానే ఆవిడ ఆదాయన్ని సమకూర్చుకుంది.
ఈవిడ పాలు అమ్మకాల్లో సృష్టించిన రికార్డు లకు గుజరాత్ రాష్ట్రంలో కేవలం రెండు సంవత్సరాలలో 2 లక్ష్మీ అవార్డులు, 3 ఉత్తమ అవార్డులు ఆమెను వరించాయి.గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిడకి ఈ అవార్డులను సొంతం చేసుకుంది.ఈ 62 సంవత్సరాల నిరక్షరాస్యులు కింద ప్రస్తుతం 11 మంది పని చేస్తున్నారు.
ఈమెను చూస్తే డబ్బు సంపాదించడానికి కేవలం చదువు మాత్రమే అవసరం లేదు కేవలం కృషి పట్టుదల ఉంటే సరిపోతుందని ఇట్టే అర్థమవుతుంది.