రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం తెలిసిందే.అయితే ఈ విషయం చాలా సార్లు రుజువయింది.
ఈ విషయం మనకు ఎన్నికల సమయంలోనే ఎక్కువగా బయటపడుతుంది.ఎన్నికల ముందు వరకు బీభత్సంగా విమర్శించుకున్న పార్టీలు ఎన్నికలలో గెలుపు కోసం సీట్ల సర్దుబాటు చేసుకొని కలిసి మెలసి బరిలోకి దిగుతాయి.
అయితే తాజాగా లింగాజిగూడ కార్పొరేటర్ కార్పొరేటర్ గా గెలిచిన తరువాత అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది.దీంతో ఈ స్థానం ఖాళీ అయింది.
అయితే బీజేపీ ఈ విషయంపై ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్న సందర్బంలో బీజేపీ నేతలు కలవడంతో కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు.
అయితే ఈ కార్పొరేషన్ కు సంబంధించి కాంగ్రెస్ తమ అభ్యర్థికి బీ ఫారం ఇస్తారనే వార్తలు రావడంతో కేటీఆర్ ఉత్తమ్ కు ఫోన్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి.
అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అయితే బండి సంజయ్ బీజేపీ నేతలు వెళ్ళి కేటీఆర్ ను కలవడంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే దీనిపట్ల బండి సంజయ్ త్రిసభ్య కమిటీ వేయడం, తరువాత బండి సంజయ్ పై అధిష్టానానికి సదరు నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఏది ఏమైనా రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరనే విషయం మరో సారి ఋజువైందని చెప్పవచ్చు.