కరోనా తన వేట ప్రారంభించింది.ఒకప్పుడు కోవిడ్ నియంత్రణ విషయంలో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్న భారత్, ప్రస్తుతం విదేశాలు సానుభూతి చూపించే స్దాయికి చేరింది.
ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అనేది కాదు ముఖ్యం.
ప్రస్తుతం ప్రజల ప్రాణాలను రక్షించే వ్యవస్ద పూర్తిగా విఫలం అయ్యింది.
ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు.ప్రాణాల మీద తీపి ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
లేదంటే శ్మశానాల్లో కూడా చోటు లేదు.
ఇకపోతే కరోనా నాటి అండర్ వరల్డ్ డాన్ ను సోకింది.
ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చోటా రాజన్కు కరోనా పాజిటివ్ వచ్చిందని జైలు అధికారులు నిర్ధారించారు.కాగా ఇటీవల కొవిడ్ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న చోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి సోమవారం విషమించడం తో, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించామని అధికారులు వెల్లడించారు.