గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ పేరు మార్మోగుతుంది.గత నెల 30వ తేదీన తాను ప్రేమించిన వ్యక్తి గౌతం కిచ్లు ను వివాహమాడి ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు.
అక్కడ ఎంతో అందమైన ప్రదేశాలన్నింటిని చుట్టేస్తూ ఎంతో సరదాగా గడుపుతున్నారు.అయితే ఇప్పటికే తన హనీమూన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను కాజల్ అగర్వాల్ షేర్ చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ మరికొన్ని ఫోటోలను కూడా కాజల్ షేర్ చేశారు.
హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ, సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్న గౌతమ్, కాజల్ దంపతులు అండర్ వాటర్ బెడ్ రూమ్ లో సేద తీరారు.
ఆ అందమైన బెడ్ రూమ్ లో సముద్రపు అందాలను వీక్షిస్తూ, రొమాంటిక్ మూడ్ లో ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ బెడ్ రూమ్ లో తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా, సోలోగా కూడా కాజల్ ఫోజులతో మతిపోగొడుతుంది.
ఈ హనీమూన్ కు సంబంధించిన ఫోటోలను కాజల్ అగర్వాల్ షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారాయి.గత కొద్ది రోజుల నుంచి కాజల్ అగర్వాల్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయింది.వీరి నిశ్చితార్థం మొదలుకొని హనీమూన్ ట్రిప్ వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.అయితే తన హనీమూన్ ట్రిప్ ను మరొక వారం రోజుల్లో ముగించుకొని తిరిగి రానున్నారట.
అయితే దీపావళి పండుగను పురస్కరించుకుని తర్వాత కాజల్ అగర్వాల్ తిరిగి హైదరాబాద్ చేరుకొని తాను అంగీకరించిన సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.