ఎన్టీఆర్.ఈ పేరుకు ఒక చరిత్ర ఉంది.తెలుగు వారి అభిమాన నటుడు ఎన్టీఆర్.ఎవరైనా ఇతడి తర్వాతే.సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ ని మించిన వారు లేరు.సినిమాల్లో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టిస్తే.
రాజకీయాల్లో ఎన్నో అద్భుత నిర్ణయాలు తీసుకొని అందరిని షాక్ కి గురి చేశారు. ఇక అలానే తిరుపతిలో జరిగిన ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ వచ్చిన ఎన్టీఆర్ ని చూసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఎందుకంటే అయన కాషాయ దుస్తులలో దర్శనం ఇచ్చాడు.ఈ గెటప్ లో ఎందుకు వచ్చారు అని ఎంతోమందికి అడగలనుకున్నప్పటికి ఎన్టీఆర్ ని అడిగే దైర్యం ఎవరికీ ఉంది చెప్పండి.
అందుకే ఆ సమయంలో అడగలేదు. కానీ ఫంక్షన్ ముగిసిన తర్వాత విలేకర్లు ఆయన్ని ప్రశ్నించగా.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.ఓ బాలికను దారుణంగా చెరిచిన సంఘటన అతని మనసును కలచి వేసినట్టు.
జీవితంపై విరక్తి పుట్టిందని ఎన్టీఆర్ అన్నారు.అయితే అధికారంలో ఉండగా సంశయం తీసుకోవడం ఎలా కుదురుతుందని అతన్ని ప్రశ్నించగా.
ఎన్టీఆర్ తనను తాను రాజయోగి అని చెప్పుకున్నారు. ఇక ఈ విషయం అప్పట్లో దేశమంతా తెలిసిపోయింది.
అతడు కొద్దీ రోజులకు మాంసం తినడం పూర్తిగా మానేశారు.అయితే కాషాయ దుస్తులు ధరించడానికి కారణం స్వామి అగ్నివేశ్ అని తెలిసింది.
మానవ హక్కుల ఉద్యమంలో భాగంగా స్వామి అగ్నివేశ్ ఎన్టీఆర్ ని ఒకసారి కలవగా.అతన్ని దుస్తుల ప్రత్యేకత గురించి అడిగారని.ఆ సమయంలో స్వామిజి చెప్తూ.”సన్యాసిగా ఉంటే మనకు ఎలాంటి స్వార్ధం ఉండదు.మనం మనకోసం కాకుండా సమాజం కోసం పని చేస్తాం.మీరు నిజాయితీగా పని చేయాలంటే సన్యసించండి” అని చెప్పారు.ఆ మాటలు ఎన్టీఆర్ ని పూర్తిగా మార్చేశాయి.దీంతో కొద్దీ రోజులకే కాషాయ దుస్తులు ధరించి దాదాపు 8 ఏళ్ల పాటు అవే దుస్తులలో ఉండి ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు.