వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేట్ అయింది.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొద్ది నెలల నుండి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రిపబ్లిక్ డే నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ లో ఒక రైతు మరణించడమే కాక 18 మంది పోలీసులకు గాయాలు కావడంతో లాఠీచార్జి టియర్ గ్యాస్ రైతుల పై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.ఈ ఘటనపై తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ వ్యక్తిగత ప్రతినిధి అయిన స్టెఫానీ డుజారిక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో ఎక్కడయినా సరే శాంతియుతంగా జరిగే నిరసనలను గౌరవించాలని సూచించారు.సభ స్వేచ్ఛ, అహింసను గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే జరిగిన హింస పై ఇప్పటికే 22 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగింది.ర్యాలీ హింసాత్మకం కావడంతో రైతు ఆందోళనలో ముందు నుంచి ఉన్న నలభై ఒక రైతు సంఘాలు.
మంగళవారం జరిగిన హింసకి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది.