ఏపీ శాసనమండలిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, యనమల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో డిక్లరేషన్ ఎన్నికల కమిషనర్ పరిధిలో ఉందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.చట్టసభలతో సంబంధం లేని విషయంపై ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై చర్చకు టీడీపీ సహకరించడం లేదన్నారు.టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన యనమల ప్రశ్నించే హక్కు చట్టసభల్లో అందరికీ ఉందని స్పష్టం చేశారు.