నిజంగా మీరు విన్నది నిజమే.ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సెప్టెంబర్ 5 న ఆస్ట్రేలియా కు చెందిన ఒక ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ పీటర్ లేలర్ మాల్ మైసన్ అనే హోటల్ కు వెళ్ళాడు.అయితే అక్కడ ఒక బీర్ ఆర్డర్ చేశాడు.
అయితే తనకు అమెరికాకు చెందిన బ్రాండ్లు వద్దని చెప్పడంతో బ్రిటన్కు చెందిన బ్రాండ్ డ్యూచర్స్ ఐపీఏను సర్వ్ చేశారు.బీరు తాగడం ముగిశాక బిల్లు చెల్లింపు కోసం పీటర్ తన కార్డు ఇచ్చాడు.
ఉద్యోగిని బిల్లు చెల్లింపు కోసం స్వైప్ చేసుకొని కార్డు తిరిగివ్వబోతూ ఉండగా.బీరు ఖరీదెంతయింది? అని పీటర్ అడిగగానే ఉద్యోగిని కంగారు పడి, వెంటనే పరిగెత్తుకుంటూ మేనేజర్ వద్దకు వెళ్ళింది.అప్పుడు గానీ పీటర్ కు అసలు విషయం అర్ధం కాలేదు.ఇంతకీ విషయం ఏంటంటే.బీరు తాగాక బిల్లు చెల్లింపు సమయంలో సదరు ఉద్యోగిని 99,983.64 డాలర్లు (రూ.73,70,226) అని టైప్ చేయడంతో ఆ సొమ్ము పీటర్ ఖాతా నుంచి హోటల్ ఖాతాలోకి వెళ్లిపోయింది.దీనిపై స్పందించిన మేనేజర్ పీటర్కు సొమ్ము మొత్తాన్ని రీఫండ్ చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ తప్పు జరిగినందుకు పీటర్కు క్షమాపణలు కూడా తెలిపారు.గత జులైలో నటుడు రాహుల్ బోస్కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.
చండీగఢ్లోని మారియట్ హోటల్లో బస చేసిన ఆయన రెండు అరటి పళ్లను ఆర్డర్ చేసినందుకు రూ.442.50 బిల్లు వేసిన ఘటన సోషల్ మీడియా లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ 5 న జరిగిన ఈ ఘటన పై కూడా ట్వీట్స్ మీద ట్వీట్స్ రావడం తో ఈ విషయం ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.