నలుగురికి మంచి చేస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు.ఉన్నంతలో మంచి చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు.
కాని ఎంత ఉన్నా కూడా కొందరు మంచి చేసేందుకు ఇష్టపడరు.వారికి సాయం చేస్తే నాకేం వస్తుందన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు.
అలాంటి వారు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు.ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి తన పరిస్థితి బాగాలేకున్నా కూడా మంచితనంతో ఒక ముసలమ్మకు సాయం చేశాడు.
ఆ మంచితనం అతడికి లక్షల రూపాయల సాయంను తెచ్చి పెట్టింది.ప్రపంచంలోనే అత్యంత అరుదైన సంఘటనగా ఇది నిలిచింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.యూకేకు చెందిన జేమ్స్ అండర్సన్ అనే ప్లంబర్ ఉన్నాడు.అతడి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.షాపు రెంటు చెల్లించలేక, ఇతరత్ర ఖర్చులకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు.
అయినా కూడా తన నమ్మకంను కోల్పోకుండా తనకు వచ్చిన పనిని చేస్తూ ఉన్నాడు.ఒక రోజు జేమ్స్ అండర్సన్కు ఒక ముసలమ్మ కాల్ చేసింది.తన ఇంట్లో ప్లంబింగ్ పని ఉందని చెప్పడంతో అక్కడకు వెళ్లాడు.91 ఏళ్ల ఆ వృద్దు రాలు ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.అంతే కాకుండా ఆమె ఆర్ధికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా జేమ్స్ అండర్సన్ గుర్తించాడు.
ఆమె ఇంట్లో ప్లబింగ్ పని పూర్తి చేసిన జేమ్స్ అండర్సన్ డబ్బులు తీసుకోకుండా ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా కూడా ఇబ్బంది లేకుండా నాకు ఫోన్ చేయండి అంటూ ఆమెకు చెప్పేసి వచ్చాడు.జేమ్స్ ఆర్ధిక వ్యవస్థ అంద దారుణంగా ఉన్నా కూడా మంచి తనంతో 91 ఏళ్ల ముసలమ్మ దగ్గర ఏం డబ్బులు తీసుకుంటాం అనుకున్నాడు.అతడి ఆలోచనకు అంతా ఫిదా అయ్యారు.
ఈ విషయం ఆ నోటీ ఈనోట పడి వైరల్ అయ్యింది.ముసలమ్మకు సాయం చేసిన వ్యక్తికి ఎంతో మంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
జేమ్స్ చేసిన సాయం గురించి తెలిసిన వారు అతడికి సాయం చేయాలనుకున్నారు.జేమ్స్ స్నేహితుడు సోషల్ మీడియలో జేమ్స్ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ పెట్టడంతో అందరికి తెలిసింది.
అతడి మంచితనంకు ఎవరికి తోచిన సాయం వారు చేశారు.అలా జేమ్స్ ఖాతాలోకి కొన్ని రోజుల వ్యవధిలోనే 80 వేల ఫౌండ్లు అంటే దాదాపుగా రూ.70 లక్షల రూపాయలు పడ్డాయి.ప్రస్తుతం అతడు చాలా సంతోషంగా ఉన్నాడు.
అతడి అప్పులు తీరిపోయి మంచి వ్యాపారం జరుగుతోంది.అందుకే మంచి చేస్తే ఏదో ఒక సమయంలో మంచి జరుగుతుంది అంటారు.