భారత్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారి పోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.ప్రస్తుతం ఆయన లండన్ లో తలదాచుకుంటున్నారు.
అయితే ఆయన బెయిల్ కోసం లండన్ కోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా దానికి కోర్టు నిరాకరించినట్లు తెలుస్తుంది.అంతే కాకుండా జడ్జి నీరవ్ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ లభిస్తే నీరవ్ మోడీ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని భారత తరపున వాదించిన లాయర్ తెలపడం తో ఆ వాదనలకు కోర్టు కూడా సుముఖత చూపింది.అనుమానం వ్యక్తం చేశారు.
విచారణ సందర్భంగా జడ్జి నీరవ్ మోడీ తరఫు న్యాయవాదికి గట్టిగా చురకలేశారు.
బెయిల్ లభిస్తే సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా ఉంటారనే నమ్మకం తనకు కలగడం లేదని జడ్జి అన్నారు.భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని,పిటిషనర్ పై ఎన్నో దేశాల్లో మోసం, కుట్ర కేసులు నమోదై ఉన్నాయని, అందువల్ల బెయిల్ ఇవ్వడం సరికాదని జడ్జి అన్నారు.నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ ఈ విధంగా కోర్టు తిరస్కరించడం ఇది నాలుగోసారి.
ఇంతకు ముందు లండన్ లోని ఒక కోర్టు 48 ఏళ్ల నీరవ్ మోడీ ని జూన్ 26 వరకు జైలు (జుడీషియల్ కస్టడీ)లో ఉంచాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా దానికి కోర్టు నాలుగోసారి నిరాకరించింది.