చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఉదయ్ కిరణ్.కెరీర్ ఆరంభంలో వరుస హిట్ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ తర్వాత ఊహించని విధంగా వరుస ఫ్లాపులతో వెనక పడిపోయాడు.
వ్యక్తిగత జీవితం కూడా అతనికి అనుకున్న స్థాయిలో సక్సెస్ లు రాకపోవడానికి కారణం అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.ఇక సినిమా కెరీర్ దెబ్బతినడంతో మానసికంగా కృంగిపోయి చివరికి ప్రాణాలు తీసుకున్నాడు.
ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు చిత్రం చెప్పిన కథ అనే ఓ థ్రిల్లర్ మూవీలో నటించాడు.ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
అయితే సినిమా రిలీజ్ చేద్దామనుకునే సమయానికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
తర్వాత మూవీ రిలీజ్ కూడా ఆగిపోయింది.ఇప్పుడు ఆ సినిమాని మరల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం డిజిటల్ ఛానల్స్ అందుబాటులో ఉండడంతో ఉదయ్ కిరణ్ చివరి చిత్రానికి ఊహించని విధంగా క్రేజీ వచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓ ఒటీటీ ఛానల్ ఈ సినిమాకి భారీ రేటు చెల్లించి రైట్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తుంది.త్వరలో సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఉదయ్ కిరణ్ చివరి చిత్రం కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన ఉండే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ ని మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులకి చూపించినట్లు అవుతుందని నిర్మాతలు భావించి ఒటీటీ రిలీజ్ కి ఆసక్తి చూపించినట్లు బోగట్టా.