ఈ సంవత్సరం సంబంధించి ఐపీఎల్ 2020 జరుగుతుందో, జరగదో అన్న సందర్భం నుండి ఎట్టకేలకు ఈనెల 19 నుంచి నవంబర్ పదో తారీకు వరకు యూఏఈ దేశంలో పూర్తిస్థాయి ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి.ఇక ఇందుకు సంబంధించి కేవలం పది రోజులు మాత్రమే ఉన్నాయి.
ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2020 సీజన్ లో గత సంవత్సరం ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్, రన్నరప్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతోంది.
ఇక ఇది ఇలా ఉండగా ప్రతి సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి ఐపీఎల్ కార్యవర్గం ప్రతి సంవత్సరం ఒక పాటను విడుదల చేసేవారు.ఇదే క్రమంలో ఈ సారి కూడా ఐపీఎల్ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.‘ ఆయేగీ హమ్ వాపస్ ‘ అనే లిరిక్స్ తో మొదలయ్యే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో భారతీయ జరగాల్సిన ఐపీఎల్ కాస్త యూఏఈ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కరోనా పై విజయం సాధించి తిరిగి మళ్ళీ ఐపీఎల్ భారత్లోనే నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించారు.
గత ఎనిమిది నెలల నుండి టీమిండియా ఆటగాళ్లు క్రికెట్ లేక పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో ఎప్పుడెప్పుడు క్రికెట్ ఆటగాళ్లు గ్రౌండ్ లో దిగి బౌండరీ లతో వారి అభిమానులను అలరిస్తారో అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే బయో బబుల్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లను బిసిసిఐ ఈ దేశంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యలు నడుమ నిర్వహించబోతున్నారు.ఎవరైనా ఆటగాళ్లు బయో బబుల్ రూల్స్ ను అతిక్రమించిన వారికి కఠినమైన చర్యలు నిర్మించబోతున్నట్లు బీసీసీఐ క్రీడాకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కూడా.