ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడిన వారిని రక్షించేందుకు వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.ఇప్పటికే పలువురు డాక్టర్లు ప్రాణాలు కోల్పోగా.
మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు.క్లిష్ట పరిస్ధితుల్లో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న వైద్యులకు ఆయా దేశాల ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.
తాజాగా అమెరికాలో ముగ్గురు చిన్నారులు డాక్టర్లలో మరింత ఉత్సాహం నింపేలా చేసిన ప్రయత్నానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు దక్కాయి.
ఈ ముగ్గురిలో ఓ తెలుగు బాలిక కూడా ఉంది.
శ్రావ్య అన్నపురెడ్డి అనే బాలిక గర్ల్స్ స్కౌట్ మెంబర్గా వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్ధతు తెలుపుతూ.
వారిలో మరింత ఉత్సాహం నింపేలా వ్యక్తిగత కార్డులను పంపించింది.ఈ చిన్నారి చేసిన పని వైట్హౌస్ దాకా వెళ్లడంతో … ట్రంప్ శనివారం ఈ బాలికను తన కార్యాలయానికి పిలిపించి సత్కరించారు.
శ్రావ్యతో పాటుగా లైలా ఖాన్, లారెన్ మ్యాట్నీ అనే మరో ఇద్దరు బాలికలను కూడా అధ్యక్షుడు సత్కరించారు.
మేరీల్యాండ్ ఎల్క్రిడ్జ్లోని ట్రూప్ 744కు చెందిన ఈ ముగ్గురు బాలికలు 100 బాక్స్ల గర్ల్స్ స్కౌట్స్ కుకీస్ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి విరాళంగా ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరం శ్రావ్య స్వస్థలం.ఆమె తండ్రి విజయ్ రెడ్డి ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్నారు.
తల్లి సీత కల్లం విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు.అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా తనకు దక్కిన గౌరవంపై శ్రావ్య స్పందిస్తూ తన తల్లిదండ్రులు తనను భారతీయ సాంప్రదాయాల ప్రకారం పెంచారని చెప్పింది.