కొత్త సంవత్సరం ఆ ఇంట్లో తీరని విషాదం!

పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టిన ప్రపంచం వేడుకలతో సంబరాలు చేసుకుంటోంది.అంతేకాకుండా యువత తమ అల్లర్లతో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్నారు.ఇలా ప్రపంచమంతా కొత్త సంవత్సరం సందడిలో ఉండగా ఓ చోట ఓ ఇంట్లో తీరని విషాదం జరిగిన ఘటన అందరిని బాధ పడేలా చేసింది.

 Youth Killed In Bike Accident , Warangal,wardhannapet,bike Accident,birthday Par-TeluguStop.com

2020 సంవత్సరం లో ఎన్నో ప్రాణ నష్టాలు జరిగాయి.ఇకనైనా ఈ ప్రపంచం చల్లగా ఉండాలని దీవించిన మరుక్షణమే రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.నూతన సంవత్సరం అడుగు పెట్టి ఒక్క రోజు కూడా గడవలేదు.కానీ ఆ ఇద్దరికీ అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి.తమ ఇంటిని కొత్త సంవత్సరం రోజున చీకట్లు చేశాయి.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నీలగిరి స్వామి తాండా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక బాలుడు గాయపడ్డాడు.స్నేహితుని పుట్టినరోజు అని వేడుకలకు ద్విచక్ర వాహనంపై వెళ్ళిన శ్రీకాంత్(20), శ్రీశాంత్(19), ఓ బాలుడు వెళ్లారు.

ఈ క్రమంలో పుట్టినరోజు వేడుకలు ముగించుకొని వస్తున్న క్రమంలో చెట్టుకు తగిలి ప్రమాదం జరిగింది.అందులో అక్కడికక్కడే శ్రీకాంత్, శ్రీశాంత్ మరణించగా.

ఓ బాలుడు రేవంత్ గాయాలతో బయటపడ్డాడు.కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన చోట కి వెళ్లి పరిశీలించగా.

ద్విచక్ర వాహనం చెట్టుకు తగిలి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఆ బాధిత కుటుంబం కు కొత్త సంవత్సరం రోజున తమ బిడ్డలు అనంత లోకాలకు వెళ్లి తీరని శోకాన్ని మిగిలించారు.కాబట్టి యువత చేతిలో వాహనాలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube