జార్ఖండ్ లోని రాంచీ పట్టణానికి చెందినటువంటి రాజేష్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు.అయితే ఈ ఇద్దరి భార్యలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు రాజేష్.
అయితే కొద్ది కాలం తర్వాత ఈ భార్యల విషయం ఒకరికి ఒకరు తెలుసుకున్నారు.దీంతో ఎలాగో ఇద్దరికీ తెలిసిపోయిందని ఇద్దరితోనూ కలిసి జీవిస్తున్నాడు రాజేష్.
అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలోనే అసలైన చిక్కు వచ్చి పడింది.
ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడుగా చక్కగా సాగుతుంది జీవితంలోకి మనస్పర్ధలు విభేదాలు వంటి కారణాలు ప్రవేశించాయి.
దీంతో ఇద్దరూ భార్యలు విడిపోయి వేరువేరుగా కాపురాలు పెట్టారు.అయితే ఈ క్రమంలో రాజేష్ ఎక్కువ సమయాన్ని తన రెండో భార్య దగ్గరే గడుపుతుండటంతో మొదటి భార్యకి చిర్రెత్తుకొచ్చింది.
దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి తన మొదటి భార్యతో కూడా కొంత సమయం గడపాలని సూచించారు.
దీంతో రాజేష్ ఎక్కువ సమయం మొదటి భార్యతో గడుపుతూ రెండో భార్య సంగతి మర్చిపోయాడు.దీంతో రెండో భార్య మళ్లీ పోలీస్స్టేషన్ కి వెళ్లి మొదటి భార్య చేసిన విధంగానే ఫిర్యాదు నమోదు చేసింది.దీంతో మళ్లీ పోలీసులు పిలిపించి చి ఈసారి వరం రోజులని రెండు భాగాలుగా విడగొట్టి మొదటి మూడు రోజులు మొదటి భార్య ఉండాలని రెండు మూడు రోజులు రెండవ భార్య తో ఉండాలని తీర్పునిచ్చారు మిగిలిన ఒక రోజు మాత్రం తన తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసుకోవడం కోసం కేటాయించారు.ఆ విధంగా రాజేష్ కథ సుఖంఠం అయ్యింది.
కథ అయితే సుఖంఠం అయ్యింది కానీ శాశ్వత పరిష్కారం దొరకలేదని రాజేష్ వాపోతున్నాడు.